గాంధీనగర్ సాయిబాబా గుడిలో చోరీ

21 Jul, 2015 12:47 IST|Sakshi

గాంధీనగర్ : నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో చోరి జరిగింది. లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని సాయిబాబ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు నాలుగు హుండీలను బద్దలు కొట్టి వాటి నుంచి సుమారు రూ.60 వేల నగదు తస్కరించారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలిని పరిశీలించిని పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు