సాయిబాబా ఆలయంలో చోరీ

5 Aug, 2015 09:55 IST|Sakshi

కట్టంగూరు(నల్లగొండ): దుండగులు సాయిబాబా గుడిలోని హుండీ పగలగొట్టి సొత్తు ఎత్తుకెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి హుండీ తలుపులు పగలగొట్టి ఉండటాన్నిగమనించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాధమిక విచారణ చేపట్టారు. ఎత్తుకెళ్లిన నగదు రూ. 30 వేలు ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదే చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

 

మరిన్ని వార్తలు