సీసీ కెమెరాలో రికార్డయిన చోరీ

6 Nov, 2015 16:53 IST|Sakshi

కారేపల్లి (ఖమ్మం జిల్లా) : కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలోని కోటమైసమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. హుండీ పగులగొట్టి సుమారు రూ.15 వేలు అపహరించారు. ఈ చోరీ దృశ్యాలు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు