31న గురుకులాల రౌండ్‌టేబుల్ సమావేశం

28 May, 2015 23:53 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని సమస్యలపై అన్ని సంఘాలు కలసి గురుకులాల సమాఖ్యగా ఏర్పడి ఈ నెల 31న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నా యి.

‘గురుకుల వ్యవస్థ బలోపేతం-సమస్యలు-పరిష్కారం’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సంఘాల నాయకులు రామలక్ష్మణ్, దయానంద్, రవిచందర్, సీతామనోహర్, అర్జున వెంకట్‌రెడ్డి, యాదయ్య, బాలరాజు, పరంధాములు ఒక ప్రకటనలో తెలిపారు.

>
మరిన్ని వార్తలు