సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో రూ.2 వేల కోట్లను రుణంగా తీసుకుంది. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్) కింద బాండ్ల అమ్మకాలు, సెక్యూరిటీల ద్వారా ఈ రుణాన్ని పొందింది. మొత్తం 6 రాష్ట్రాలు ఆర్బీఐ నిర్వహించిన వేలంలో పాల్గొన్నాయి. రాష్ట్రం తీసుకున్న రుణంలో వెయ్యి కోట్ల రూపాయలను 2026కు, మరో రూ.వెయ్యి కోట్లను 2028 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 13వ తేదీన కూడా ప్రభుత్వం బాండ్ల అమ్మకాల ద్వారా రూ.2 వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంది. దీంతో ఈ నెలలోనే రూ.4 వేల కోట్ల రుణం తీసుకున్నట్లు అయింది. చదవండి: కట్టుదిట్టంగా లాక్డౌన్.. డీజీపీ ఆదేశాలు!