రాజీవ్ రహదారికి రూ. 750 కోట్లు

31 Oct, 2014 20:28 IST|Sakshi

తెలంగాణలో మూడుచోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ రహదారిపై సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 750 కోట్ల రూపాయలతో ఈ రహదారిని పునరుద్ధరించాలని నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. సిద్దిపేట, షామీర్ పేట, ఎల్కతుర్తి ప్రాంతాల్లో ఫై ఓవర్లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు.

మరిన్ని వార్తలు