రూ.పది ఇవ్వలేదని భార్య ప్రాణం తీశాడు...

23 Jul, 2014 03:32 IST|Sakshi

నర్సంపేట: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి 10 రూపాయుల కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు. వరంగల్ జిల్లా నర్సంపేట వుండలం లక్నెపల్లి గ్రామానికి చెందిన తుప్పతుర్తి బుచ్చయ్య మద్యానికి బానిసయ్యాడు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలై సోమవారమే ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం స్వరూప(40)ను మద్యానికి రూ.10 ఇవ్వాలని కోరాడు. లేవని చెప్పటంతో ఆగ్రహంతో గొడ్డలితో మెడపై నరకగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
 
 
 

మరిన్ని వార్తలు