సమ్మె మాటున ఆర్టీసీ దందా

10 May, 2015 01:05 IST|Sakshi

- అద్దె బస్సుల యాజమాన్యంతో అధికారుల కుమ్మక్కు
- స్లాబ్ పద్ధతిలో టికెట్ ధరలు పెంచి బస్సులు నడిపిస్తున్న యాజమాన్యం
- వచ్చిన ఆదాయాన్ని అధికారులే నొక్కేస్తున్న వైనం
- 150 బస్సులు తిరిగినా రూ.లక్ష కూడా దాటని రాబడి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
సమ్మె సాకుతో ఆర్టీసీని లూటీ చేస్తున్నారు.. అద్దె బస్సుల యాజమాన్యంతో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కై వచ్చిన ఆదాయాన్ని నొక్కేస్తున్నారు. మొదటి నుంచి బస్సులను స్వల్పంగా నడుపుతున్నారు. సదరు బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. కానీ ఈ నాలుగు రోజుల్లో ఏ ఒక్క రోజూ కనీసం రూ.లక్ష కూడా ఆర్టీసీ ఖాతాలో జమ కాలేదు. బస్సులు నడిపి సమ్మెను నిర్వీర్యం చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఆదాయం విషయాన్ని గాలికి వదిలేసింది. దీంతో అద్దె బస్సుల యాజమాన్యం ఆర్టీసీ అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని రాబడిని పక్కదారి పట్టిస్తున్నట్టు సమాచారం.

సాధారణ రోజుల్లో...
నిత్యం జిల్లాలోని ఏడు డిపోల్లో కలిపి 610 బస్సులు తిరగుతాయి. రోజుకు కనీసం రూ.50 లక్షల ఆదాయం సమకూరుతుంది. గ్రామీణ ప్రాంత రూట్లల.

మరిన్ని వార్తలు