భద్రాద్రి ఆలయంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం

13 May, 2015 16:04 IST|Sakshi
భద్రాద్రి ఆలయంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం

భద్రాచలం: హనుమజ్జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ప్రఖ్యాత శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని ఆంజనేయస్వామికి బుధవారం ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఆలయానికి భక్తుల రాక తగ్గింది. హనుమజ్జయంతి కావడంతో ఉదయం వేళల్లో భక్తుల రద్దీ కనిపించింది. సుమారు ఐదారువేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం. దీక్ష తీసుకున్నవారు స్వామిని దర్శించుకుని, దీక్ష విరమణ చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు