నేడు అనాజిపూర్‌లో సాక్షి ‘జన పథం’

8 Dec, 2014 23:04 IST|Sakshi
నేడు అనాజిపూర్‌లో సాక్షి ‘జన పథం’

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకెళ్తున్న ‘సాక్షి’ మరో వినూత్న కార్యక్రమంతో అధికారులనే ప్రజల వద్దకు తీసుకువస్తోంది.ప్రజల సాధక బాధకాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం అనాజిపూర్‌లో ‘జన పథం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితోపాటు స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్లు హాజరవుతున్నారు. ఈ ‘జన పథం’ కార్యక్రమంలో వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.

మరిన్ని వార్తలు