అరెరె.. పట్టు జారె..

10 Aug, 2019 08:53 IST|Sakshi

శ్రావణ శుక్రవారం నగరంలోని కొన్ని కళాశాలలు, పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో విద్యార్థులు ఆటవిడిపు కోసం సంజీవయ్య పార్కుకు వచ్చి సరదాగా గడిపారు. ఓ మిత్ర బృందం మాత్రం చల్లని వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూ పార్కులోని కొలను గట్లపై గెంతులేశారు. ఒక విద్యార్థి ఇవతలి గట్టు నుంచి అవతలి గట్టుకు దూకుతూ కేరింతలు కొట్టాడు. ఒకసారి బాగానే దాటినా.. రెండోసారి మాత్రం పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. ఈ దృశ్యాలు ‘సాక్షి’ కెమెరా బందించింది.      – ఫొటోలు: ఎ. సురేష్‌కుమార్‌

మరిన్ని వార్తలు