అట్టహాసంగా ‘ఎస్‌పీఎల్‌’ ముగింపు వేడుక

15 Feb, 2020 15:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌(నేరేడ్‌మెట్‌) : ‘సాక్షి’ ప్రీమియర్‌ లీగ్‌’ (ఎస్‌పీఎల్‌) రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీల బహుమతుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. గురువారం నేరేడ్‌మెట్‌ సైనిక్‌పురిలోని భవన్స్‌ క్రికెట్‌ మైదానంలో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. సాక్షి డైరెక్టర్లు ఏఎల్‌ఎన్‌ రెడ్డి, రాణిరెడ్డి, భవన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ జేఎల్‌ఎన్‌ శాస్త్రి, శ్రీచైతన్య గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఏజీఎం డీ.వెంకటేశ్వర్లు, డీన్‌ జి.విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు