ఉప్పల్‌లో పోలీసులు కార్డాన్ సెర్చ్

29 Jan, 2015 07:45 IST|Sakshi

హైదరాబాద్: ఉప్పల్ ప్రాంతంలోని చిలుకానగర్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి పోలీసుల కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. మల్కాజ్‌గిరి డీసీపీ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది పోలీసులు 19 బృందాలుగా విడిపోయి, దాదాపు 2వేల ఇళ్లలో సోదాలు చేశారు.తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఉంచిన గ్యాస్ కట్టర్లు, సిలిండర్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి బ్యాంకు దొంగతనాలతో సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు