సందడి చేసిన సమంత

8 Jun, 2019 07:27 IST|Sakshi

హీరోయిన్‌ సమంత శుక్రవారం శరత్‌ సిటీ మాల్‌లో సందడి చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ స్టోర్‌ను సందర్శించింది.  

రాయదుర్గం: సౌత్‌ఏషియాలోనే మొదటిసారిగా కొండాపూర్‌లో ప్రారంభించిన ఒప్పో ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌లో బుధవారం సినీ హీరోయిన్‌ సమంత సందడి చేశారు. శరత్‌సిటీమాల్‌లో నగరంలోనే మొదటి ప్రీమియం ఫ్లాగ్‌ షిప్‌స్టోర్‌ను ఒప్పో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమంత రెనో సీరిస్‌లో ఏ సీరిస్‌ నుంచి హై ఎండ్‌ ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించారు. అనంతరం ఫ్యాన్స్‌తో  ముచ్చటించారు.  అభిమానులతో పాటు ఒప్పో స్టోర్‌ యాజమానులు, కంపెనీ ప్రతినిధులతో సెల్పీఫోటోలు దిగారు.  త్వరలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబాయి, గుర్‌గావ్, ఆహ్మదాబాద్‌లో కూడా ఇలాంటి స్టోర్‌లను ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

మరిన్ని వార్తలు