సనా బేగం మృతి

26 May, 2017 07:40 IST|Sakshi

నిజామాబాద్‌: భర్త కట్న దాహంతో నిప్పుపెట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సనా బేగం తుదిశ్వాస విడిచింది. కాలిన గాయాలతో మృత్యువుతో పొందుతున్న ఆమె.. గురువారం రాత్రి కన్నుమూసింది.

నిజామాబాద్‌లోని నిజాం కాలనీకి చెందిన సనాపై భర్త రజాక్‌ ఎప్రిల్‌ 18న కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. గర్భణి అయిన సనా నిద్రిస్తున్న సమయంలో రజాక్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 60 శాతం కాలియనగాయాలతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. నెలలు నిండకుండానే పుట్టిన ఆ పసికందు ఈ నెల 24న చనిపోయింది. ఈ క్రమంలో 38 రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతన్న సనా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
 

 

మరిన్ని వార్తలు