-

ఎనిమిది మంది డీఎస్సీడీవోలకు అవార్డులు 

27 Jan, 2019 04:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీల అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖకు పలు జిల్లాల్లో పురస్కారాలు దక్కాయి. వసతిగృహ విద్యార్థులకు క్రీడోత్సవాలు, విజ్ఞాన విహార యాత్రలు, డబుల్‌ బెడ్‌లు, దుప్పట్ల పంపిణీ, సకాలంలో ఉపకారవేతనాల పంపిణీ తదితర కార్యక్రమాలను నిర్ణీత సమయంలో సాధించినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం వారు ఆయా జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వీరిలో నల్లగొండ, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మహబూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మెదక్‌ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారులు (డీఎస్సీడీవో) ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు పి.కరుణాకర్‌ వారిని అభినందించారు. రానున్న రోజుల్లో మరింత స్ఫూర్తిగా పనిచేసి ఇతర అధికారులకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు