స్కూల్‌బస్సు ఢీకొని చిన్నారి మృతి

5 Dec, 2015 12:06 IST|Sakshi

వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు రోడ్డు దాటుతున్న చిన్నారిని ఢీకొట్టిన ఘటనలో  చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  ఈ సంఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం తునికల్లతండాలో శనివారం చోటుచేసుకుంది.

తండాకు చెందిన ఏడాదిన్నర వయసున్న చిన్నారి కౌసల్య రోడ్డు దాటుతున్న సమయంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో.. బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామస్థులు చిన్నారి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

>
మరిన్ని వార్తలు