టెన్త్‌ విద్యార్థినికి నీలిచిత్రాలు చూపిస్తున్న....

11 Sep, 2014 18:30 IST|Sakshi
టెన్త్‌ విద్యార్థినికి నీలిచిత్రాలు చూపిస్తున్న....

మహబూబ్‌నగర్‌: పాఠాలు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు పశువుగా మారాడు.పదవ తరగతి  విద్యార్థినికి నీలి చిత్రాలు చూపిస్తూ తన కోరిక తీర్చాల్సిందిగా వత్తిడి చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలోని  సాందీపని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జానకిరాంరెడ్డి తన స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.  తన కోరిక తీరిస్తే స్కూల్ ఫీజులు, పరీక్ష ఫీజులు తనే చెల్లిస్తానంటూ వేధించసాగాడు.

ఉపాధ్యాయుడి వేధింపుల గురించి ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పాఠశాల వద్దకు వచ్చేసరికి ఉపాధ్యాయుడు పరారైనాడు. స్థానిక విద్యార్థి సంఘాలు నిందితుడిని అరెస్ట్ చేయాలని  డిమాండ్ చేస్తున్నాయి. కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగాయి. . పోలీసులు కేసు నమోదు చేస్తామనిహామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు నిరసన విరమణ చేశాయి.
**

>
మరిన్ని వార్తలు