లాక్‌డౌన్‌: అన్నం, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ

7 Apr, 2020 15:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రోజువారి కూలీలు, వలస జీవులు, బడుగులు, సంచాలకులు తిండి దొరకని దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గడ్డుకాలంలో వారిని ఆదుకోవడానికి అనేక మంది ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బులు పంచుతుంటే, మరికొందరు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన ఫిరోజ్‌ ఖాన్‌ అనే వ్యక్తి స్వచ్చందం ముందుకు వచ్చారు. ఈ గడ్డు కాలంతో తిండి దొరక్క అలమటిస్తున్న సికింద్రాబాద్‌ ప్రాంతంలో నిరాశ్రయులకు, సంచాలకులకు పులిహోర, వాటర్‌ ప్యాకెట్లు పంపిణి చేసి మనవతను చాటుకున్నారు. 
(నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్‌ పిలానీ)

మరిన్ని వార్తలు