రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి

27 Jan, 2015 07:45 IST|Sakshi

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన ఇన్నోవా, మహారాష్ట్రకు చెందిన టవేరా వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. వేగంగా ఢీకొనటంతో వాహనాలు నుజునుజ్జు అయ్యాయి.

ప్రమాదంలో కేరళకు చెందిన ఒక మహిళ, మహారాష్ట్ర వాసుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, కార్లలో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, మహారాష్ట్ర వాసులు తిరుపతి నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు