చొప్పదండి: ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడి పాల్పడ్డ ఇరువురు అత్యాచారానికి పాల్పడ్డ ఉందంత ఆలస్యంగా వెలుగుచూసింది. చొప్పదండి సీఐ సత్యనారాయణ కథనం.. చొప్పదండి బీసీ కాలనీకి చెందిన రాజశేఖర్ (21) ఉరఫ్ శేఖర్, సోహైల్ (19) ఇద్దరు స్నేహితులు. వీరు గత ఆదివారం అదే కాలనీలో నివాసముండే అయిదో తరుగతి చదివే పదకొండేళ్ల బాలుడిని రాజశేఖర్ ఇంటికి తీసుకొచ్చారు.
అప్పటికే ఇద్దరు స్నేహితులు భూపాలపట్నం శివారులో తెల్లకల్లు తాగి రాగా, వెంట మరో అయిదు లీటర్లు వెంట తెచ్చుకున్నారు. బాలుడికి కల్లు తాగించారు. కల్లుతో పాటు సిగరెట్లు తాగే సమయంలో సెల్ఫోన్లో రికార్డు చేసిన రాజశేఖర్, సోహైల్ కల్లు తాగిన విషయం ఇంట్లో చెబుతామని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. వికృత చేష్టలకు పాల్పడ్డారు. రాజశేఖర్ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు.
సంఘటన జరిగి వారం రోజులైన విషయం బయటకు రాలేదు. రెండు రోజుల తర్వాత బాలుడి బాబాయ్ ఒకరు ఫోన్ నంబర్ కోసం రాజశేఖర్ సెల్ఫోన్ చూడడంతో అందులో అత్యాచార దృశాలు చూసి అవాక్కయ్యాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం నిందితులపై బాలల అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ, ఎస్ఐ రియాజ్ పాషా తెలిపారు. అత్యాచారానికి గురైన బాలుడి తండ్రి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడని పోలీసులు వెల్లడించారు.