'వాస్తు పిచ్చితో కేసీఆర్ ఇష్టానుసారంగా..'

21 Feb, 2015 16:27 IST|Sakshi
'వాస్తు పిచ్చితో కేసీఆర్ ఇష్టానుసారంగా..'

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వాస్తుపిచ్చితో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణకు సీఎం కాకుండా రాజునని అనుకుంటున్నాడేమోనని షబ్బీర్ మండిపడ్డారు. సీఎం కాన్వాయ్, నివాస భవనం కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని ఆరోపించారు. 'రాజుల సొమ్ము రాళ్లపాలు' అన్నట్టు వాస్తుపిచ్చితో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ప్రజలు అడుగుతున్న పింఛన్లు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని విమర్శించారు. రిటైర్డు ఐఏఎస్లకు సలహాదారు పదవులు, ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇచ్చి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదే తంతు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు తగిన గుణపాఠం చెబుతారని షబ్బీర్ అలీ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు