అమిత్‌ షా పర్యటన వాయిదా

6 Apr, 2017 10:56 IST|Sakshi
హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నగర పర్యటన వాయిదా పడింది. ఎన్డీఏ పార్టీల సమావేశం కారణంగా అమిత్‌షా ఢిల్లీలో బిజీగా ఉన్నరని అందుకే పర్యటనను వాయిదా వేస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు తెలిపారు.
 
ఏప్రిల్‌ 7న నగరానికి రావాల్సిన అమిత్‌షా ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉండటంతో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ పర్యటన త్వరలోనే మరో సారి ఉంటుందని ఆయన అన్నారు. 
>
మరిన్ని వార్తలు