నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం ఉదయం గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని గొర్రెలను పంపిణీ చేశారు. నల్గొండ లోకసభ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఉప్పల్ గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. ఊట్కుర్ గ్రామంలో యాదవులు మంత్రి జగదీష్ రెడ్డికి సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం పలికారు.