చిన్నశంకరంపేట(మెదక్): సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తండాకు చెందిన గోవింద్ అనే వ్యక్తి ఇంట్లో సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.