ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయించండి

19 Nov, 2014 23:52 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంటగ్యాస్‌పై నగదుబదిలీకి సంబంధించి మూడునెలల గడువున్నందున వినియోగదారులంతా ఆధార్ కార్డు వివరాలను బ్యాంకు ఖాతాకు అనుసందానం చేయించాలని జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి సూచించారు. గ్యాస్ నగదుబదిలీపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 14.49లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయని, ఇందులో 12.82లక్షల మందికి ఆధార్ కార్డులున్నాయన్నారు. వీరిలో 11.49లక్షల మంది బ్యాంకు ఖాతాతో అనుసందానం చేయించారన్నారు. మిగతా వినియోగదారులు గడువులోగా సీడింగ్ చేయించుకోవాలని సూచించారు. ఈ అంశంపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ నర్సింహారెడ్డి, ఎల్‌డీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

 అర్హులందరికీ పింఛన్లు: జేసీ
 జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి అన్నారు. పింఛన్ల పంపిణీపై బుధవారం కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ పింఛన్లు అందించాలని, ఆందోళన చెందకుండా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యతో కొంత జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలో సమస్యను అధిగమించి అర్హులకు న్యాయం చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు