70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

26 Aug, 2017 17:32 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : లబ‍్ధిదారులకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తోన్న వారి ఆట కట్టించారు పోలీసులు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు 70 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జగదేవ్‌పూర్‌ మీదుగా ఓ లారీలో తరలిస్తున్న 140 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలించేందుకు వినియోగించిన లారీని సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు