బస్సులోనే డ్రైవర్‌కు రాఖీ కట్టిన చెల్లెలు

16 Aug, 2019 09:11 IST|Sakshi

సాక్షి, కరీమాబాద్‌(కరీంనగర్‌) : హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న గట్టు కృష్ణవేణి తన అన్నయ్యకు రాఖీ కట్టుందుకు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఉర్సుకు గురువారం వచ్చింది. అయితే ఆమె సోదరుడు ఆర్టీసీ లోకల్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గడ్డం జితేందర్‌ అప్పటికే డ్యూటికీ వెళ్లాడు. ఈ క్రమంలో కృష్ణవేణి అన్నయ్యకు ఫోన్‌చేయగా.. వరంగల్‌ బస్టాడ్‌ ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో ఆమె అక్కడికే వెళ్లి బస్సులోనే రాఖీ కట్టి తన ఆనందాన్ని పంచుకుంది. 

మరిన్ని వార్తలు