ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి

16 Apr, 2020 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి లభించింది. 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు ప్రమోషన్‌​ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వారంతా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ)గా పదోన్నతి పొందినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

పదోన్నతి పొందిన  ఐపీఎస్‌ అధికారులు..

  • కార్మికేయ
  • కే రమేష్‌ నాయుడు
  • వీ సత్యనారాయణ
  • బీ సుమతి
  • ఎమ్‌ శ్రీనివాసులు
  • వెంకటేశ్వరరావు
మరిన్ని వార్తలు