తెలంగాణలో ఆరు రెడ్ జోన్లు
18 ఆరెంజ్ జోన్లు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలపై సడలింపులు ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. రాష్టాల వారిగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు రెడ్ జోన్లుగా గుర్తించింది. అలాగే దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్స్పాట్ జిల్లాలను ప్రస్తుతం 129కి తగ్గించింది. (రికార్డు స్థాయిలో కరోనా కేసులు)
తెలంగాణలోని రెడ్ జోన్లు..
మరోవైపు కరోనా తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా వర్గీకరించింది. తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలకు ఈ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే రెండు వారాల కింద ఆరెంజ్ జోన్లు సంఖ్య 207గా ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 297కు పెరిగింది. అదే విధంగా తెలంగాణలో ఆరెంజ్ జోన్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుకు గుర్తించింది
ఆరెంజ్ జోన్లు జాబితా..
తెలంగాణలో గ్రీన్ జోన్లు