భూ ప్రకంపనలతో బెంబేలు

14 Aug, 2018 22:26 IST|Sakshi

ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో కంపించిన భూమి 

సాక్షి, కొత్తగూడెం/మహబూబాబాద్‌: ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. భారీ శబ్ధాలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో 5 సెకన్లు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, సుజాతనగర్, చండ్రుగొండ, జూలూరుపాడు తదితర మండలాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది.  అయితే ఎక్కడా ఆస్తి నష్టం జరగలేదు. మహబూబాబాద్‌లోని కంకరబోడ్‌లో ఉన్న సమైక్య డిగ్రీ కళాశాల సమీపంలో స్వల్ప భూకంపం వచ్చిందని స్థానికులు తెలిపారు. 

మరిన్ని వార్తలు