కల్లు తాగిన పాము

3 Apr, 2017 06:57 IST|Sakshi
కల్లు తాగిన పాము
బెల్లంపల్లి: దాహార్తితో జనావాసాలకు వచ్చిన ఓ కింగ్‌కోబ్రా పాముకు నీళ్లు తాగించడం చూశాం.. అది మరవకముందే మరో అరుదైన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మండుతున్న ఎండలకు బేజారైందో.. కల్లు రుచి చూద్దామనుకుందో గానీ ఓ పాము ఈత కల్లు తాగింది. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ సమీపంలో ఆదివారం పాము ఈత చెట్టుపై ఉన్న లొట్టి(కుండ)లోకి దూరి కల్లు తాగింది. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది. 
మరిన్ని వార్తలు