-

ఉపాధి హామీలో ఘన వ్యర్థాల నిర్వహణ

7 Jun, 2018 04:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా ప్రతి 1000 మంది జనా భాకు 5 లక్షల చొప్పున ఖర్చు పెడతారు. ఈ పనిలో పాలుపంచుకున్న పారిశుధ్య కార్మికులు ఎంత సమయం పని చేయాలి, వారికి ఎంత వేతనం చెల్లించాలనే వివరా లను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ పనులకు నిధు లు సమకూర్చే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.

మరిన్ని వార్తలు