కుషాయిగూడలో పేకాట రాయుళ్ల అరెస్టు!

21 Apr, 2020 16:37 IST|Sakshi

10 మంది పేకాట రాయుళ్ల అరెస్టు

సాక్షి​, హైదరాబాద్‌: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కమలానగర్‌లో పేకాట శిబిరంపై ప్రత్యేక పోలీసులు బృందాలు మంగళవారం దాడులు చేశాయి. డాల్ఫిన్స్‌ బాయ్స్‌ హాస్టల్‌పై‌ దాడి చేసి 10 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.94 వేల నగదు, 9 మొబైల్‌ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎం.శ్రీకాంత్‌, ఎ.సందీప్‌, వి.సాయి, ఎ.భరత్‌, ఎ.కార్తీక్‌, కె.సాయికిరణ్‌, బి.రాజు, ఎస్‌.రాజు, వి.కల్యాణ్‌, డి.వాసును కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


 

మరిన్ని వార్తలు