కిరాణా దుకాణాలపై ఎస్‌వోటీ దాడులు

30 Nov, 2015 18:03 IST|Sakshi

ఉప్పల్ (హైదరాబాద్) : నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న కిరాణా దుకాణాలపై ఎస్‌వోటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శ్రీ సుమధుర అనే కిరాణ దుకాణం లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 240 లీటర్ల కిరోసిన్, 50 కిలోల కందిపప్పు, 110 కిలోల గోదుమలను గుర్తించారు. దీంతో ఆ దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు