హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం

20 Sep, 2019 15:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డీజీపీలు హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అందించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు చర్చిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌తో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అధికారులు సందర్శించే అవకాశమున్నట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు