స్పోర్ట్స్‌ కోటా అమలుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

29 Sep, 2019 01:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లో స్పోర్ట్స్‌ కోటా అమలుపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి శనివారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సాట్స్‌ వీసీఎండీ నియమితులయ్యారు. సభ్యులుగా ఉన్న త విద్యామండలి ప్రతినిధి, జేఎన్‌టీయూ, కాళోజీ వర్సిటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీల రిజిస్ట్రార్‌ లేదా వర్సిటీ నియమించిన ప్రతినిధులు, తెలంగాణ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌  కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్లను నియమించింది.

మరిన్ని వార్తలు