'టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్'

14 Feb, 2015 17:18 IST|Sakshi
'టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్'

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ పరిధిలో టీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. సీమాంధ్రకు చెందిన వారు కూడా టీఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 5 లక్షల మంది టీఆర్ ఎస్ సభ్యత్వం తీసుకున్నారని ఆయన చెప్పారు. జీహెచ్ ఎంసీ రాజకీయాలను మార్చే సత్తా ఒక్క టీఆర్ ఎస్ కే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ తో ఎలాంటి విబేదాలు లేవని, ఇరుగు పొరుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని నాయిని అన్నారు.

మరిన్ని వార్తలు