8న తిరుపతికి ప్రత్యేక రైలు 

7 Jun, 2018 02:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌–తిరుపతి (7429/7428) కి ప్రత్యే క రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శుక్రవారం సాయంత్రం 7.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి తిరుపతి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 10వ తేదీ సాయంత్రం 5గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కి హైదరాబాద్‌ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు