పరుగుతో ఆరోగ్యం పదిలం: మల్లారెడ్డి

13 Sep, 2015 20:27 IST|Sakshi

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో బోయిన్ పల్లి ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో 1 కే రన్ నిర్వహించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ కోసం సైనికులు సుదీర్ఘ పోరాటం చేసి దక్కించుకున్నారని తెలిపారు. సైనికుల పోరాటానికి తాను సహకారం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయోత్సవ సంబరాలకు మళ్లీ తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు.
 

మరిన్ని వార్తలు