తిరుమల దేవస్థానంలో స్వామివారి కళ్యాణం

6 Mar, 2017 12:39 IST|Sakshi
బీర్కూర్‌(నిజామాబాద్‌): తెలంగాణ తిరుమల దేవస్థానంలో సోమవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పోచారం  దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, షిండేలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు