జనవరి 8న ఆటో బంద్‌

29 Dec, 2018 02:32 IST|Sakshi
ప్లకార్డులతో ఆటో జేఏసీ ప్రతినిధులు 

ఫైనాన్షియర్ల వేధింపులపై నిరసన... 

హైదరాబాద్‌ : ఫైనాన్షియర్ల వేధింపులను ఆరికట్టడానికి ప్రభుత్వం అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని జనవరి 8న ఒక్క రోజు ఆటోబంద్‌ను తెలంగాణ ఆటో డ్రైవర్‌ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరులతో ఆ సంఘాల నేతలు మహ్మద్‌ అమానుల్లాఖాన్‌(టీఏడీజేఏసీ), బి. వెంకటేశం(ఏఐటీయుసీ)లు మాట్లాడారు. పద్మప్రియా ఆటో ఫైనాన్స్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆటో డ్రైవర్‌ ఎస్కే.జానీ మృతి చెందాడని, ఆ ఫైనా న్స్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని వారు కోరారు. ఈ ఫైనాన్స్‌ సంఘాలు పార్టీలకు పార్టీ నిధి ఇస్తుండటంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫైనాన్సర్ల వేధింపులపై ఫిర్యాదు చేసినా  పోలీసులు వీరిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో ఎంఎ. సలీం. రఫతుల్లాబేగ్, సత్తిరెడ్డి, కిరణ్, మల్లేశ్‌గౌడ్, అజయ్‌బాబు పాల్గొన్నారు. 


 

మరిన్ని వార్తలు