ఇంటికి చేరిన ‘టింగు’

25 Jul, 2019 13:07 IST|Sakshi
టింగుతో వంశీధర్‌

కుషాయిగూడ: గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన పెంపుడు కుక్క (టింగు) ఎట్టకేలకు ఇంటికి చేరడంతో కథ సుఖాంతమయింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సైనిక్‌పురికి చెందిన వంశీధర్‌ పెంపుడు కుక్క అపహరణకు గురైన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బోయిన్‌పల్లిలో చెత్త కుప్పల వద్ద కనిపించిన టింగును జగదీష్, మహేశ్‌ ఇద్దరు యువకులు చేరదీసి ఇంటికి తీసుకెళ్లారు. దీనిని గుర్తించిన మరో వ్యక్తి ఈ కుక్క విషయమై దినపత్రికల్లో వార్త వచ్చినట్లు చెప్పాడు. దీంతో సదరు యువకులు నేరుగా  వంశీధర్‌ ఇంటికి వెళ్లి కుక్కను అప్పగించారు. మీడియా, పోలీసుల చొరవతోనే టింగు తిరిగి వచ్చిందని వంశీధర్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు