చిన్నారి కళ్ల నుంచి వస్తున్న రాళ్లు

8 Mar, 2015 04:17 IST|Sakshi
చిన్నారి కళ్ల నుంచి వస్తున్న రాళ్లు

చెన్నూర్: ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి చెందిన నరిగె సమ్మయ్య-సమ్మక్కల కూతరు స్వర్ణలత (8) కళ్లలోంచి రాళ్లు వస్తున్నాయి. స్వర్ణలత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గురువారం నాటి నుంచి శనివారం సాయంత్రం వరకు సుమారు 30 రాళ్లు పడినట్లు బంధువులు తెలిపారు. బాలికను సమీపంలోని అంగ్రాజ్‌పల్లి పీహెచ్‌సీలో వైద్య చికిత్సల నిమిత్తం తీసుకువెళ్లగా హైదరాబాద్ ఆసుపత్రిలో చూపించాలని అక్కడి వైద్యులు చెప్పారు. కూలీ పని చేసుకుని బతికే తాము బిడ్డను హైదరాబాద్ ఎలా తీసుకెళ్లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ కూతురు వైద్య చికిత్స కోసం దాతలు సహాయంఅందించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు