దండం పెట్టే రోజులు పోయాయి

27 Feb, 2020 03:08 IST|Sakshi
సిద్దిపేట పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న హరీశ్‌

లంచం అడిగితే కఠిన చర్యలు

‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు   

సాక్షి, సిద్దిపేట: లంచాలు అడిగే అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు అనుగుణంగా మున్సిపల్‌ కొత్త చట్టం లో నిబంధనలు పొందు పరిచారని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన సిద్దిపేటలోని పలు వార్డుల్లో తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. దరఖాస్తులు పెట్టి దండం పెట్టే రోజులు పోయాయన్నారు. సిరిసిల్లకు యాభై ఏళ్ల దరిద్రం వది లిందన్నారు. కేటీఆర్‌ చొరవతో అభివృద్ధిలో దూసుకెళుతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బుధవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హరీశ్‌ హాజరయ్యారు.
    

మరిన్ని వార్తలు