శంకర్‌నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

16 Jul, 2017 01:40 IST|Sakshi

తమ్మినేని డిమాండ్‌  
సాక్షి, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతిమీనా పట్ల అనుచిత ప్రవర్తన తదనంతర పరిణామాల నేపథ్యంలో అక్కడి ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశా రు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనిపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపిం చాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఓ ప్రక టన విడుదల చేశారు.

ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్‌ స్పందించడం, కేసు పెట్టడం, బెయిల్‌పై విడుదల కావడం వెంట వెంటనే జరిగాయని అన్నారు. ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులపై టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు పెత్తనం చలాయించడంవంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. గతంలో కరీంనగర్, వరంగల్, నిజామా బాద్‌ జిల్లాల్లో ఇదే తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు.

>
మరిన్ని వార్తలు