కీసర: ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సం ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు చీర్యాలకు చెందిన విద్యార్థిని(19) మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్స రం చదువుతోంది. ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులకు భోజనం తీసుకెళ్లేందుకు ఉదయం ఆటో కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అంబేద్కర్ నగర్కు చెందిన ఆటోడ్రైవర్ నరేష్(25) బైక్పై వచ్చి విద్యార్థినిని ఎక్కడకు వెళ్తున్నావని మాటల్లోకి దింపాడు. రాంపల్లి చౌరస్తా వద్ద ఘట్కేసర్ బస్సు ఎక్కిస్తానని ఆమెను బైక్పై ఎక్కించుకున్నాడు.
అనంతరం దమ్మాయిగూడ గ్రామం వైపు వెళ్లే అటవీ మార్గంలోకి బైక్ను మళ్లించాడు. ఎందుకు దారి మళ్లించావంటూ నిల దీయగా ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు గంటలపాటు విద్యార్థినిని చిత్రహింసలు పెట్టిన నరేష్ ఘట్కేసర్ ఆస్పత్రి వద్ద దింపాడు. అత్యాచారం దృశ్యాలను సెల్ఫోన్లో బంధించానని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోని బయటపెట్టి పరువు తీస్తానని హెచ్చరించాడు. జరిగిన ఘోరాన్ని తల్లి లక్ష్మికి తెలియజేసి తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితురాలు విలపించింది. దీంతో కుమార్తెకు ధైర్యం చెప్పిన తల్లి.. కీసర పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చే సినట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు.