సబ్‌కలెక్టర్ కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తం

30 Jan, 2016 12:56 IST|Sakshi

ఆసిఫాబాద్: అదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్‌కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.  ఆసిఫాబాద్‌లోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డగించేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మరిన్ని వార్తలు