వికటించిన ఎంఆర్‌ వ్యాక్సిన్‌

17 Aug, 2017 15:32 IST|Sakshi
- ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
 
మందమర్రి: ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రిలో ఎంఆర్‌ వ్యాక్సిన్‌ వికటించింది. స్థానికంగా ఉన్న లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. రూబెల్లా వాక్సిన్‌ను విద్యార్థులకు ఇవ్వగానే వారికి తీవ్రమైన వాంతులు అయ్యాయి. కొందరు కళ్లు తిరిగి పడిపోయారు.
 
దీంతో విద్యార్థులను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వాక్సిన్‌ను సరైన విధంగా ఇప్పించటంలో యాజమాన్యం విఫలం అయిందని విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు.
మరిన్ని వార్తలు