రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

27 Dec, 2015 15:04 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టు దుజ్జెనపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో కరీంనగర్ వైపు వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న టాటాఏస్, స్కూటీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్‌ఐ అంబేద్కర్ ఆస్పత్రిలో మృతి చెందినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు